Coffee Today

Saturday, October 19, 2019

టీ తాగి, కప్పును తినోయొచ్చు.. హైదరాబాద్‌లో సరికొత్త ఆవిష్కరణ

టీ తాగి, కప్పును తినోయొచ్చు.. హైదరాబాద్‌లో సరికొత్త ఆవిష్కరణ

టీ తాగి కప్పు పడేస్తున్నారా? అయితే, ఈ కప్పులను మాత్రం పడేయక్కర్లేదు.. తాగిన తర్వాత తినేయొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ సరికొత్త కప్పులను ఆవిష్కరించింది. వీటిని ‘ఈట్ కప్’ అంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ కప్పులను రూపొందించారు. ఇందులో వేడి పదార్థాలే కాదు.. చల్లనివి కూడా వేసుకుని తాగేసి, తినేయచ్చు.

ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ స్పందిస్తూ.. ‘‘ప్లాస్టిక్, పేపర్ కప్పులకు ప్రత్యామ్నయంగా ఈ కప్పులను అందుబాటులోకి తెచ్చాం. వీటిని ధాన్యాలతో తయారు చేశాం’’ అని తెలిపారు. ఈ కప్పులో టీ తాగిన వెంటనే బయట పడేయకుండా తినేస్తే చాలు. వేడి లేదా చల్లని పదార్థాలు వేసిన వెంటనే ఇది కరిగిపోదు. దాదాపు 40 నిమిషాలు వరకు గట్టిగా ఉంటుంది. టీ మాత్రమే కాదు.. చల్లని పానీయాలు, సూప్‌లు, పెరుగు వంటివి ఇందులో వేయొచ్చు. దీనిపై ట్విట్టర్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.
తాగే లోపు గ్లాసు కరిగిపోతే?
ఇవి తినేంత పరిశుభ్రమైనవి కావు..
దీనికి, ఐస్‌క్రీమ్ కోన్‌కు తేడా ఏమిటీ?
మట్టి కప్పులు వాడండి
ముందు తాగి తర్వాత తినాలా?

No comments:

Post a Comment