Coffee Today

Monday, October 14, 2019

నోబెల్‌కు ఎంపికైన ఆర్థికవేత్త అభిజిత్‌

ప్రతి భారతీయుడికీ ఇదో గొప్ప రోజు’
నోబెల్‌కు ఎంపికైన ఆర్థికవేత్త అభిజిత్‌కు అభినందనల వెల్లువ
‘ప్రతి భారతీయుడికీ ఇదో గొప్ప రోజు’
దిల్లీ: అర్ధశాస్త్రంలో ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్‌ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీని వరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల వేదికగా అభినందనలు చెబుతున్నారు. ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గాను ఈసారి అభిజిత్‌ బెనర్జీతో పాటు ఎస్తేర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌లకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది.  దీనిపై రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు పలు సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. 
నోబెల్‌ గ్రహీతకు సోనియా అభినందనలు
అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి సాధించిన ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. ‘ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు బెనర్జీ తన పరిశోధనలతో దేశం గర్వించే విధంగా చేశారు. ఆయన పరిశోధనలు భారత్‌తో పాటు ప్రపంచంలో మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడేందుకు సహకరించాయి. ఆయన అనుసరించిన విధానాలు, ప్రయోగాలు ఆదర్శప్రాయమైనవి. ఆయన శ్రమకు గానూ నోబెల్‌ పురస్కారం లభించడం భారతీయుల్ని ఎంతో ఆనందింపజేసింది’ అని సోనియా పేర్కొన్నారు. 
‘‘సౌత్‌ పాయింట్‌ స్కూల్‌, కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అభిజిత్‌ బెనర్జీకి హృదయపూర్వక అభినందనలు.  దేశాన్ని మరో బెంగాలీ గర్వపడేలా చేశారు. చాలా ఆనందంగా ఉంది’’ - మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి
‘‘ప్రతి భారతీయుడికీ ఇదో గొప్ప రోజు. ఈ ఏడాది అర్ధశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం దక్కించుకున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి హృదయ పూర్వక శుభాకాంక్షలు. పేదరిక నిర్మూలన కోసం చేసే పనికి విశేష ఆమోదం లభిస్తుంది’’ - అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ సీఎం
అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సాధించిన అభిజిత్‌కు అభినందనలు. ప్రపంచంలో పెరిగిపోతున్న పేదరికంపై ఆందోళన వ్యక్తంచేస్తూ దాన్ని నిర్మూలించేందుకు చూపించిన మార్గాలు ప్రశంసనీయం. ప్రెసిడెన్సీ, జేఎన్‌యూ పూర్వ విద్యార్థులపై జరుగుతున్న దుష్ప్రచారంలో పసలేదని మరోసారి రుజువు చేశారు. పూర్వ విద్యార్థుల్ని గర్వపడేలా చేశారు. ప్రెసిడెన్సీ కళాశాల నుంచి మరో నోబెల్‌ సాధించిన వ్యక్తిగా నిలిచారు’’ - సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
అభిజిత్‌ స్వయంగా మంచి వంటగాడు‌. భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి అపారమైన జ్ఞానం కలిగినవాడు. భారతీయ సంస్కృతికి, విజ్ఞానానికి ఆయన ప్రతినిధిగా నిలుస్తున్నారు. ప్రపంచం మొత్తానికి ఆయన జ్ఞానాన్ని పంచుతున్నారు. - రామచంద్ర గుహా, ప్రముఖ చరిత్రకారుడు
నోబెల్‌ సాధించిన అభిజిత్‌ బెనర్జీకి అభినందనలు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన అద్భుతమైన కృషి భారత్‌ను గర్వపడేలా చేసింది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అయిన అభిజిత్‌ బెనర్జీ.. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ్‌ కార్యక్రమానికి కీలక కన్సల్టెంట్‌గా పనిచేశారు’’ 

No comments:

Post a Comment