Coffee Today

Wednesday, September 25, 2019

అమితాబ్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు






                                   

అమితాబ్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రముఖుల ప్రశంసలు

బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో అనేకమంది ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


 మితాబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీని యాక్షన్ మూవీలవైపు నడిపించిన గొప్ప వ్యక్తి. ఆయన తన గోల్డెన్ వాయిస్‌తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తికి అత్యున్నతమైన అవార్డు దక్కడం గొప్ప విషయం అన్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు అని ప్రశంసించారు.

టాలీవుడ్ హీరో నాగార్జున ,తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు అనేకమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అమితాబ్ కి అభినందనలు తెలిపారు.






   

1 comment: